మూడేళ్ళ తర్వాత మూవీ సెట్స్ లో అడుగుపెట్టిన అనుష్క

అనుష్క శెట్టి ఒకప్పుడు టాప్ నటిగా టాలీవుడ్ ను ఏలింది. అయితే కావాలని చేస్తోన్న సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించేసింది అనుష్క. రెండేళ్లకో, మూడేళ్లకో ఒక సినిమా చేస్తోంది. 2020లో నిశ్శబ్దం విడుదలైన తర్వాత ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా చేయని అనుష్క, ఇప్పుడు మూడేళ్ళ తర్వాత సినిమా సెట్స్ లో మళ్ళీ అడుగుపెట్టింది.

మహేష్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఈరోజు నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 40 ఏళ్ల మహిళ పాత్రలో అనుష్క ఈ చిత్రంలో నటిస్తుంది. అనుష్క సరసన నవీన్ పోలిశెట్టి హీరోగా చేయనున్నాడు.

హైదరాబాద్ లోనే ఈ చిత్ర మెజారిటీ షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత వెబ్ ప్రాజెక్ట్స్ లో కూడా నటించనుంది అనుష్క.


Recent Random Post: