సింగిల్ మదర్ కష్టాలు చూపించబోతున్న ‘భాగమతి’

బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోతుంది.. తద్వార వరుసగా సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కాని ఆమె బరువు పెరగడం వల్ల సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కూడా వర్కౌట్‌ అవ్వడం లేదు. దాంతో సినిమా ల సంఖ్య ను దారుణంగా తగ్గించేసింది. బాహుబలి తర్వాత భాగమతి మరియు నిశబ్దం సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాని ఆ రెండు సినిమా లు కూడా బొక్క బోర్లా పడ్డాయి. దాంతో గ్యాప్ తీసుకుని తదుపరి సినిమాకు సిద్దం అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క తదుపరి సినిమా లో కవల పిల్లలకు తల్లిగా కనిపించబోతుందట. అది కూడా సింగిల్ మదర్‌ గానే ఆమె కనిపిస్తుందని అంటున్నారు. పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త చనిపోవడం అప్పటికే ఆమె గర్బవతి అవ్వడం.. ఆ తర్వత ఇద్దరు పిల్లలను కనడం.. వారిని పెంచుతూ సమాజంలో ఆమె ఎదుర్కొనే సవాళ్లను ఆసక్తికరంగా చూపించబోతున్నారట. సింగిల్ మదర్స్ ఈ సమాజంలో పడుతున్న ఇబ్బందులు మరియు వారు పడే మానసిక క్షోబ గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారట.


Recent Random Post: