జగన్ నుండి షర్మిల వైపుకు యాంకర్‌ శ్యామల అడుగులు

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలు యాంకర్‌ శ్యామల. ఈమె సుదీర్ఘ కాలంగా బుల్లి తెరపై సందడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కూడా ఈమె పలు షో లకు యాంకర్‌ గా హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇక యాంకర్ శ్యామల మరియు ఆమె భర్త నరసింహా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపాలో జాయిన్ అయ్యారు. ఇద్దరు కూడా వైకాపాకు మద్దతుగా నిలిచారు. ఇద్దరు కూడా సోషల్‌ మీడియాలో జగన్‌ కు అనుకూలంగా మాట్లాడారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు సైలెంట్‌ అయ్యారు.

యాంకర్‌ శ్యామల రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన చేయడం లేదేమో అంటూ కొందరు వ్యాఖ్యలు చేశారు. క్రియాశీలక రాజకీయాల విషయంలో యాంకర్‌ శ్యామల మరో అడుగు వేయబోతున్నారా అంటే అవును అనిపిస్తుంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో షర్మిల భర్త బ్రదర్‌ అనీల్‌ ను ఈ యాంకర్ దంపతులు కలవడం చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీలో జాయిన్‌ అవ్వడం కోసమే వీరు బ్రదర్‌ అనీల్‌ ను కలిశారా అంటే అవును అని చాలా మంది బలంగా సమాధానాలు చెబుతున్నారు. వైకాపాకు దూరం జరిగి షర్మిల పార్టీలో వీరు జాయిన్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Recent Random Post: