శాకుంతలం : అల్లు అయాన్, అభయ్‌ రామ్‌ల్లో ఎవరు?

గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న శాకుంతలం సినిమా చిత్రీకరణ సగానికి పైగా పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కొత్త సెట్‌ నిర్మాణం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుణ శేఖర్‌ మాట్లాడుతూ శాకుంతలం షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఒక స్టార్‌ కిడ్ ను నటింపజేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గుణశేఖర్ మనసులో ఎన్టీఆర్ తనయుడు అభయ్‌ రామ్‌ మరియు అల్లు అర్జున్‌ తనయుడు అల్లు అయాన్ లు ఉన్నట్లుగా తెలుస్తోంది.

వారిద్దరిలో ఎవరో ఒకరు శాకుంతలం సినిమాలో కనిపించబోతున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు వారు షూటింగ్‌ లో పాల్గొనాల్సి ఉంటుంది. నెల రోజుల పాటు వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వారితో షూటింగ్‌ చేయాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్‌ మరియు ఎన్టీఆర్‌ లకు గుణ శేఖర్‌ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతోనే ఈ సినిమాలో తమ కొడుకులను నటింపజేసేందుకు ఖచ్చితంగా ఓకే చెప్తారు. కనుక ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ సినిమాలో నటింపజేస్తారని అంటున్నారు. అయితే వారు ఎవరు అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.


Recent Random Post: