కరోనా: ఆది పురుష్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి!

కరోనా సెకండ్ వేవ్ మరోసారి సినీ ఇండస్ట్రీపై ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా విడుదలలు వాయిదా పడుతున్నాయి. వీటితో పాటు ఇప్పుడు సినిమా నిర్మాణాలు కూడా ఆగిపోతున్నాయి. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా షూటింగ్ ఇప్పుడు నిలిచిపోయింది. ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోన్న విషయం తెల్సిందే.

అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 30 దాకా లాక్ డౌన్ ను విధించింది. దీంతో సినిమా షూటింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. వాటితో పాటు ఆది పురుష్ షూటింగ్ ను కూడా నిలిపివేశారు.

దీంతో ప్రభాస్ హైదరాబాద్ చేరుకున్నాడు. త్వరలోనే హైదరాబాద్ లో సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఆది పురుష్ ను ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. కృతి సనన్ కథానాయికగా నటిస్తోంది.


Recent Random Post: