ఉప్పెన ద్వారా సుకుమార్ ఎంత వెనకేసాడో తెలుసా?

జీనియస్ దర్శకుడు సుకుమార్ తన శిష్యుడు బుచ్చి బాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రెజంట్ చేసిన సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.

ఉప్పెన ఫిబ్రవరి 12న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 50 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించబోతోంది. ఉప్పెన ద్వారా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. 20 కోట్లలో నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల షేర్ సాధించింది. అలాగే సాటిలైట్, డిజిటల్ రైట్స్ అదనం. నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇలా మొత్తంగా చూసుకుంటే నిర్మాతలకు దాదాపు 50 కోట్ల లాభం మిగిలింది. అయితే ఇందులో 20 కోట్లు దర్శకుడు సుకుమార్ కు వెళ్ళిపోతుంది. ఈ సినిమాకు వెన్నుముకగా నిలిచి అంతా సజావుగా అయ్యేలా చూసినందుకు సుకుమార్ తీసుకుంటున్న ఫీజ్ అది.


Recent Random Post: