‘సిటీమార్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది


గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా సీటీమార్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ వచ్చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది. ఈ సినిమా రన్ టైమ్ 138 నిమిషాలుగా కూడా ఖరారు అయ్యింది. సిటీమార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది. కరోనా ఇతరత్ర కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేసినా కూడా సాధ్యం అవ్వలేదు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ సినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. వారి పట్టుదలతో సినిమా కాస్త రిస్క్ అయినా కూడా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనాలు మెల్ల మెల్లగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

గోపీచంద్ మరియు తమన్నాలు ఈ సినిమాలో కబడ్డి కోచ్ లుగా కనిపించబోతున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో కబడ్డీ ఆటను అత్యంత ఇంట్రెస్ట్ గా చూపించబోతున్నట్లుగా చెబుతున్నారు. కబడ్డి మ్యాచ్ ల కోసం యూనిట్ సభ్యులు చాలా ఖర్చు చేశారు అనేది కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ హడావుడి చేస్తున్నారు. గోపీచంద్ మరియు తమన్నాలకు ఈ సినిమా చాలా కీలకం. సంపత్ నంది కూడా ఈ సినిమా తో సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది కనుక మాస్ ఎలిమెంట్స్ కాస్త ఎక్కువగానే ఉండి ఉంటాయి అనేది టాక్.


Recent Random Post: