సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ ప్రెస్ ఓటిటి విడుదల

యంగ్ హీరో సందీప్ కిషన్ రీసెంట్ సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. హాకీ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో మంచి విజయంగా నిలిచింది. సందీప్ కిషన్ కు జోడిగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. మార్చ్ 5న ఈ సినిమా విడుదలైంది.

హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, హాకీ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఏ1 ఎక్స్ ప్రెస్ కు ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. డెన్నిస్ జీవన్ కొనకలను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా టిజి విశ్వప్రసాద్ నిర్మించాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కెరీర్ కు ప్లస్ పాయింట్ గా చెప్పవచ్చు.

ఇక థియేటర్లలో బాగానే ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు సిద్ధమవుతోంది. సన్ నెక్స్ట్, జియో సినిమాలో ఏ1 ఎక్స్ ప్రెస్ స్ట్రీమ్ కాబోతోంది. మే 1 నుండి ఈ సినిమా విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడైంది.


Recent Random Post: