రష్మిక లక్ శర్వాకు తగులుకుంటుందా?

ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న శర్వానంద్ నెమ్మదిగా తన స్ట్రాంగ్ హోల్డ్ ను కోల్పోతున్నాడు. వరసగా ప్లాపులను అందుకుంటూ మార్కెట్ ను డౌన్ చేసుకుంటున్నాడు. 2017లో విడుదలైన మహానుభావుడు తర్వాత శర్వాకు హిట్ అన్నదే లేదు. దాని తర్వాత చేసిన పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం ఇలా వరసగా ఐదు చిత్రాలు ప్లాప్ అయ్యాయి. మరొకటి వస్తే డబల్ హ్యాట్రిక్ అవుతుంది.

అలా అవ్వకూడదనే తనకు బాగా అచొచ్చిన ఫ్యామిలీ జోనర్ కు షిఫ్ట్ అయ్యాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తోన్న ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్ర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసాడు శర్వా. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

తన గోల్డెన్ లెగ్ తో అడుగుపెట్టిన చోటల్లా హిట్ అందుకుంటూ తక్కువ కాలంలోనే టాప్ రేంజ్ కు చేరుకుంది రష్మిక. మరి తన గోల్డెన్ లెగ్ తో శర్వా ఫేట్ మారుస్తుందా?


Recent Random Post: