బిగ్ షాక్: ఆంధ్రపదేశ్‌లో 699 క్రిస్టియన్ విలేజెస్.!

ప్రవీణ్ చక్రవర్తి.. క్రిస్టియన్ ఫాదర్ అట. విదేశాల నుంచి నిధులు రాబట్టి, ఆంధ్రపదేశ్‌ లో క్రిస్టియన్ విలేజెస్ ఏర్పాటు చేస్తున్నాడు. కాదు కాదు, అన్ని మతాలకు చెందినవారు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి మెలిసి నివసిస్తున్న గ్రామాల్ని క్రిస్టియన్ విలేజెస్‌గా మార్చుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 699 క్రిస్టియన్ విలేజెస్‌ని ఇప్పటికే తయారు చేసేవాడట. ఇంతకీ క్రిస్టియన్ విలేజెస్ అంటే ఏంటో తెలుసా.? అక్కడ చెట్టు దేవుడు, రాయి దేవుడు వుండకుండా చేయడం. అంటే, హిందూ మతం ఉనికి లేకుండా చేయడం. ఈ విషయాన్ని స్వయంగా ప్రవీణ్ చక్రవర్తి చెప్పాడు.

ధీనికి సంబంధించిన ఓ వీడియోను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే కాదు, నిధుల విషయాన్నీ.. క్రిస్టియన్ విలేజెస్ తయారీని విదేశీయుడితో చర్చిస్తున్న వీడియో కాల్ కూడా బయటపెట్టింది లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ. ఈ ప్రవీణ్ చక్రవర్తినే నిన్న ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. యూ ట్యూబ్‌లో అభ్యంతకర వీడియోలు పోస్ట్ చేస్తున్నాడన్నది ప్రవీణ్ చక్రవర్తిపై మోపబడ్డ అభియోగం.

‘చెట్టు దేవుడు, రాయి దేవుళ్ళను నా కాళ్ళతో నేనే తన్నాను..’ అని ప్రవీణ్ చక్రవర్తి చెబుతున్నాడంటే, హిందూ ధర్మం పట్ల అతనికెంత ఏహ్యభావం వుందో అర్థం చేసుకోవచ్చు. ఎవరో విదేశీయులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం.. కాసుల కోసం.. హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని చూడటం అంటే అంతకన్నా దుర్మార్గం ఇంకోటుండదు.

ఇలాంటోళ్ళ రాష్ట్రంలో చాలామందే వున్నారు. ఏ మతం పట్ల నమ్మకం వున్నవారు ఆ మతాన్ని అనుసరించవచ్చు. కానీ, ఇతర మతాల్ని కించపర్చే హక్కు ఏ మతానికి చెందినవారికీ లేదు. క్రిస్టియానిటీని పెంచుకునే క్రమంలో ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే క్రిస్టియన్ విలేజెస్‌గా మార్చేయడమేంటి.? ఈ విషయమై పాలకులు ఇకనైనా కళ్ళు తెరవాలి. అంతకన్నా ముందు.. హిందుత్వ సంస్థలు మేల్కొనాలి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ క్రిస్టియానిటీ ముసుగులో హిందుత్వం పట్ల కుట్ర పూరిత చర్యలు చేపడుతున్నవారి బండారం బయటపెట్టాలి.

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు కూడా ఈ శక్తులే కారణమా.? అన్నది తేలాల్సి వుందిప్పుడు.


Recent Random Post: