అయోధ్య రాముడి కోసం అత్తారింటికి దారేది హీరోయిన్‌ విరాళం

అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న రామ మందిరం కోసం ప్రముఖులు తమ వంతు సాయం అన్నట్లుగా వేలు, లక్షలు, కోట్ల సాయంను చేస్తున్నారు. అయితే సౌత్‌ సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున విరాళాలు మాత్రం అందడం లేదు. తాజాగా అత్తారింటికి దారేది సినిమాలో ఒక హీరోయిన్‌ గా నటించి బాపు బొమ్మ అంటూ పేరు దక్కించుకున్న ప్రణీత తన మంచి మనసుతో అయోధ్య రామాలయ నిర్మాణంకు రూ. 1 లక్ష విరాళంను ప్రకటించింది. సోషల్‌ మీడియా ద్వారా ఆ విషయాన్ని ప్రకటించింది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిపేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరు కూడా రామ మందిర నిర్మాణం కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా ఈమె మంచి మనసును చాటుకున్నారు. ఈమె ఎంతో మంది రోడ్డు సైడ్‌ ఆహారం లేకుండా బాధ పడుతున్న వారికి సాయంగా నిలిచి వారి ఆకలిని తీర్చింది.


Recent Random Post: