ప్రభాస్ సరసన రాశి ఖన్నా?

రెబెల్ స్టార్ ప్రభాస్ వరసగా ప్రాజెక్టులను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ ను దాదాపు పూర్తి చేసిన ప్రభాస్ ఆది పురుష్, సలార్ షూటింగులను మొదలుపెట్టేశాడు. ఈ రెండు సినిమాల షూటింగులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు ప్రభాస్. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు.

ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ అయినా వివిధ కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఈ పాయింట్ ను ఇండియాలో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయలేదని చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఎంపికైంది.


Recent Random Post: