అఖండ విజయం కోసం బాలయ్యతో దిల్ రాజు ప్లాన్

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` ఇటీవల థియేటర్లలో విడుదలై ఘనవిజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాసివ్ హిట్ సాధించడంతో బాలయ్య- బోయపాటి బృందాలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. సింహా-లెజెండ్ తర్వాత అఖండతో హ్యాట్రిక్ కొట్టిన ఉత్సాహం ఆ టీమ్ లో కనిపిస్తోంది.

క్రైసిస్ లోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజై డిస్ట్రిబ్యూటర్ల కళ్లలో ఆనందం నింపింది. కేవలం ఐదు రోజుల్లో 80కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అఖండ. నైజాంలోనూ వసూళ్లను అదరగొడుతోంది.

ఈ విజయం నేపథ్యంలో బాలకృష్ణ అండ్ అఖండ టీమ్ కి ప్రత్యేకంగా దిల్ రాజు- శిరీష్ బృందం పార్టీ ఇవ్వడం చర్చనీయాంశమైంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ చిత్రానికి దిల్ రాజు నైజాంకి పంపిణీ దారుగా వ్యవహరించారు.

ఉత్తరాంధ్రలోనూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేసింది. సక్సెస్ ఇచ్చిన జోష్ లో దిల్ రాజు స్వయంగా అఖండ టీమ్ కి పార్టీ ఇవ్వడం విశేషం. రాజు గారి కొత్త ఇంట్లో ఈ పార్టీని హోస్ట్ చేయడం విశేషం.

అన్నట్టు నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమా తీయాలన్నది దిల్ రాజు డ్రీమ్. అది నెరవేరుతోందా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. `అఖండ` పార్టీ అనంతరం బాలయ్య దిల్ రాజుతో సినిమాకి ఓకే చెప్పారా? అంటూ గుసగుస వినిపిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసి తన కలల్లో ఒకటి నెరవేర్చుకున్నాననే ఆనందంలో ఉన్నారు దిల్ రాజు. అఖండ విజయం నేపథ్యంలోనే యాథృచ్ఛికంగా ఈ నెల 18న దిల్ రాజు బర్త్ డే. ఆ రోజు మరో స్పెషల్ సెలబ్రేషన్ ఉంటుందేమో చూడాలి.

చరణ్ -శంకర్ లను కలుపుతూ పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీ చిత్రాన్ని నిర్మిస్తూ దిల్ రాజు ఇటీవల వార్తల్లో వ్యక్తి అయిన సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ లోనూ అతడి హవాకి ఎదురే లేదని ప్రూవ్ అవుతోంది.


Recent Random Post: